తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్'

పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

By

Published : Jan 12, 2021, 3:26 PM IST

ex mla chintha prabhakar praises cm kcr on state development
'ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి కేసీఆర్'

ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందారని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు. తెరాస ప్రభుత్వం రాష్ట్రాన్ని మున్ముందు మరింత అభివృద్ధి జరిగే దిశగా తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'సీఎం కేసీఆర్​ మోసానికి దేవుళ్లూ అతీతులు కారు'

ABOUT THE AUTHOR

...view details