తెలంగాణ

telangana

ETV Bharat / state

పురోహితులకు నిత్యావసరాలు పంచిన హరీశ్​రావు

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న పురోహితులకు సంగారెడ్డిలో మంత్రి హరీశ్​రావు నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్​ ఆవరణలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు.

By

Published : Apr 23, 2020, 6:51 AM IST

మంత్రి హరీశ్​రావు
మంత్రి హరీశ్​రావు

సంగారెడ్డిలోని పురోహితులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శుభకార్యాలన్నీ కరోనా ప్రభావంతో వాయిదా పడడం వల్ల ఉపాధి లేక పురోహితులకు ఇబ్బందులు తలెత్తాయి. వారికి అండగా నిలిచేందుకు నిత్యావసరాలను పంచిపెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టరేట్ ఆవరణలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. జిల్లాకు సంబంధించి కరోనా కట్టడిపై మంత్రి చర్చించారు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు హరీశ్​రావు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details