తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2019, 10:05 AM IST

ETV Bharat / state

విద్యార్థులకు న్యాయసేవా అవగాహన సదస్సు

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా గౌరవ కార్యదర్శి ఆశాలత అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మంజీరా జూనియర్​ కళాశాలలోని విద్యార్థులకు న్యాయ సేవా అవగాహన సదస్సు ద్వారా రాజ్యాంగ ప్రాధాన్యతను వివరించారు.

contution-day-celebrated-in-sangareddy-district
విద్యార్థులకు న్యాయసేవా అవగాహన సదస్సు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మంజీరా జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా న్యాయ సేవా అవగాహన సదస్సును న్యాయ సేవాధికార సంస్థ జిల్లా గౌరవ కార్యదర్శి ఆశాలత నిర్వహించారు. బాల్య వివాహాల నిషేధ చట్టం, ర్యాగింగ్ వంటి అంశాలపై ఆమె విద్యార్థులకు అవగాహన కల్పించి రాజ్యాంగ ప్రాధాన్యతను వివరించారు. రాజ్యాంగంలో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని వాటిని నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశాలత చెప్పారు. విద్యార్థులకు న్యాయ సహాయం ఎలా పొందవచ్చో వివరించారు.

విద్యార్థులకు న్యాయసేవా అవగాహన సదస్సు

ABOUT THE AUTHOR

...view details