తెలంగాణ

telangana

ETV Bharat / state

జహీరాబాద్​లో సంపూర్ణంగా సాగిన బంద్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​​లో ఆర్టీసీ బంద్ సంపూర్ణంగా సాగింది. బంద్​కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు పలికాయి.

By

Published : Oct 19, 2019, 6:42 PM IST

జహీరాబాద్​లో సంపూర్ణంగా కొనసాగుతున్న బంద్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఆర్టీసీ బంద్ సంపూర్ణంగా సాగింది. కార్మికుల బంద్​కు రాజకీయ పార్టీలు సహా వామపక్ష నాయకులు మద్దతు పలుకుతూ భారీ నిరసన ప్రదర్శనలు కొనసాగించారు. భాజపా, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఎమ్మార్పీఎస్, ఏఐటీయూసీ నాయకులు పార్టీల జెండాల పట్టుకొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేపట్టారు. దుకాణాలు తెరిచేందుకు యజమానులను అడ్డుకొని బంద్ పాటించాలని దుకాణాలను మూయించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జహీరాబాద్ డీఎస్పీ గణపతి జాదవ్ నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

జహీరాబాద్​లో సంపూర్ణంగా కొనసాగుతున్న బంద్

ABOUT THE AUTHOR

...view details