తెలంగాణ

telangana

ETV Bharat / state

'పరిశుభ్రత పాటిస్తూ.. నాణ్యమైన భోజనాలు వడ్డించండి'

సంగారెడ్డి జిల్లాలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాలను సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. నాణ్యమైన భోజనాలు వడ్డించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు.

By

Published : Feb 6, 2021, 5:54 PM IST

Authorities  investigation into a school in Sangareddy district that fell ill after eating contaminated food.
'పరిశుభ్రత పాటిస్తూ.. నాణ్యమైన భోజనాలు వడ్డించండి'

నారాయణఖేడ్​లోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో.. కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన పాఠశాలలో అధికారులు విచారణ చేపట్టారు. పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఇటీవల 15 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణలో.. కాలం చెల్లిన మిల్ మేకర్​తో వండిన కూర తిని అస్వస్థతకు గురయ్యారని సంబంధిత అధికారి తెలిపారు. నిత్యం వంట సామాగ్రి, పాత్రలు శుభ్రం చేయాలని తెలిపిన అధికారి, నాణ్యమైన భోజనాలు వడ్డించాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details