తెలంగాణ

telangana

ETV Bharat / state

దుకాణంలోకి దూసుకెళ్లిన టిప్పర్... ఇద్దరు మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు శివారులో తుక్కు దుకాణంలోకి టిప్పర్ దూసుకెళ్లింది. లోపల నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.

By

Published : May 18, 2019, 9:18 AM IST

మృతదేహాలను తరలిస్తున్న అంబులెన్స్​

సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు శివారు శంకరపల్లికి వెళ్లే దారిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మూతపడిన వోల్టాస్ పరిశ్రమ పక్కనున్న తుక్కు దుకాణంలోకి అతివేగంగా వచ్చిన టిప్పర్ దూసుకెళ్లింది. దుకాణంలో నిద్రిస్తున్న గోవిందు నాయక్, హనుమంతు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దుకాణంలోకి దూసుకెళ్లిన టిప్పర్... ఇద్దరు మృతి
ఇవీ చూడండి:రుతు పవనాలకు వాతావరణం అనుకూలం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details