తెలంగాణ

telangana

'సమస్యలు పరిష్కారమయ్యే వరకూ విధుల్లో చేరేదిలేదు'

By

Published : Nov 13, 2019, 3:21 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో ఎదుట చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు ఆత్మశాంతి చేకూరాలని కార్మికులు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని అప్పటి వరకూ తాము విధులలో చేరేది లేదని స్పష్టం చేశారు.

'సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విధుల్లో చేరేది లేదు'

'సమస్యలు పరిష్కారం అయ్యే వరకు విధుల్లో చేరేది లేదు'

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 40 రోజులుగా కొనసాగుతోంది. ఈరోజు డిపో ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కార అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కొలువులలో చేరేది లేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details