ఒకసారి అవకాశం కల్పిస్తే కమీషన్ కార్పొరేటర్లా కాకుండా... కామన్ మ్యాన్ కార్పొరేటర్లా కాలనీ అభివృద్ధి కోసం పనిచేస్తానని మీర్పేట్ హెచ్బీ 4 డివిజన్ కాలనీ భాజపా అభ్యర్థి బంగి జయలక్ష్మి అన్నారు. ప్రజలకు హామీ ఇస్తూ డివిజన్లో ప్రచారం నిర్వహించారు.
కామన్ మ్యాన్ కార్పొరేటర్లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి - మీర్పేటలో భాజపా ప్రచారం
రంగారెడ్డి జిల్లా మీర్పేట హెచ్బీ 4 డివిజన్లో భాజపా అభ్యర్థి బంగి జయలక్ష్మి ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తానని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
![కామన్ మ్యాన్ కార్పొరేటర్లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి కామన్ మ్యాన్ కార్పొరేటర్లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9683172-785-9683172-1606470738608.jpg)
కామన్ మ్యాన్ కార్పొరేటర్లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి
విద్యా, వైద్యం, మంచి నీరు, మురుగు నీటి సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత అని ప్రజలకు భరోసానిస్తున్నారు. గతంలో పనిచేసిన కార్పొరేటర్ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. తనను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఇదీ చూడండి:'మేనిఫెస్టోను అమలు చేసి ఇంటింటికి తిరిగి చెబుతాం'