తెలంగాణ

telangana

టీవీఎస్​ వాహనాన్ని ఢీకొన్న ఎంఈవో కారు.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా సీతారాంపేట గేటు సమీపంలో ఓ టీవీఎస్​ వాహనాన్ని మండల విద్యాశాఖ అధికారి కారు ఢీ కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుట్ల గ్రామానికి చెందిన దంపతులు మృతిచెందారు.

By

Published : Jul 16, 2019, 5:11 PM IST

Published : Jul 16, 2019, 5:11 PM IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాంపేట గేటు సమీపంలో టీవీఎస్​ వాహనాన్ని మండల విద్యాశాఖాధికారి కారు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. వీరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. మృతులు ఆరుట్ల గ్రామానికి చెందిన పూసల అంజయ్య, ఆండాలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details