తెలంగాణ

telangana

ETV Bharat / state

వేములవాడలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్​, ఎస్పీ సమీక్ష

వేములవాడ రాజన్న సన్నిధిలో జరగనున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్​ కృష్ణ భాస్కర్​, ఎస్పీ రాహుల్​ హెగ్డేలు పరిశీలించారు. జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

By

Published : Feb 23, 2021, 5:25 PM IST

vemulawada
వేములవాడ

దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మార్చి 10, 11, 12 తేదీల్లో మహాశివరాత్రి సందర్భంగా జాతర జరగనుంది. జాతర నిర్వహణకు సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డేలు ఆదేశించారు. ఏర్పాట్లను సమీక్షించారు.

పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతం, గుడి చెరువు శివారులో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాన్ని కలెక్టర్​, ఎస్పీ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మూలవాగు ప్రాంతంలో ఉన్న చెత్తను శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించారు. భక్తుల సౌకర్యార్థం 80 తాత్కాలిక షవర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మాక్ డ్రిల్స్ గురించి ఆరా తీశారు.

అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమవ్వాలని కలెక్టర్​ ఆదేశించారు. జాతరను విజయవంతం చేసేలా చూడాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డీఎస్పీ చంద్రకాంత్, ఆర్డీవో శ్రీనివాస రావు, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, డిపో మేనేజర్ భూపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పాతగుట్టలో కన్నులపండువగా బ్రహ్మోత్సవాలు..

ABOUT THE AUTHOR

...view details