తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2020, 8:26 PM IST

ETV Bharat / state

నిజామాబాద్​ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి రద్దు

కరోనా నివారణ చర్యల్లో భాగంగా నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దానితో ఫిర్యాదు దారులతో ఎప్పుడూ రద్దీగా కనిపించే పరిపాలనాధికారి భవనం నేడు నిర్మానుష్యంగా మారింది.

praja vani program cancelled in nizamabad collectorate
ప్రజావాణి రద్దుతో నిజామాబాద్​ కలెక్టర్​ కార్యాలయం వెలవెల

కరోనా విజృంభిస్తోన్న ప్రస్తుత తరుణంలో నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు కలెక్టర్​ నారాయణ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి కలెక్టరేట్​కు ఫిర్యాదు దారులు వస్తుండడం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కలెక్టర్​ పేర్కొన్నారు.

దానితో ఫిర్యాదు దారులు, పలు శాఖల అధికారులు, ఉద్యోగులు లేక కార్యాలయం వెలవెలబోయింది. ఎవరైనా ఫిర్యాదు దారులు వస్తే, వారి కోసం కలెక్టరేట్​లో వినతుల పెట్టెను ఏర్పాటు చేశారు. అధికారిని కలవనవరసం లేకుండా వారివారి అర్జీలను ఆ పెట్టెలో వేస్తే, సంబంధిత అధికారి పరిశీలించి సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:అనారోగ్యంతో దేవినేని సీతారామయ్య కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details