తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతిఒక్కరూ.. ఆనందంగా జీవించాలన్నదే సీఎం లక్ష్యం

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు కోట్ల చేపపిల్లలను వదులనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీరామ్​ సాగర్ ప్రాజెక్టులో మంత్రి చేపపిల్లలను విడుదల చేశారు.

By

Published : Aug 16, 2019, 4:53 PM IST

ఆనందంగా జీవించాలన్నదే సీఎం లక్ష్యం

పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రతిఒక్కరూ... ఆనందంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలాశయంలో మంత్రి చేపపిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ రామ్మోహన్​రావు, తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా మత్స్యకారుల కోసం చెరవుల్లో.. జలాశయాల్లో చేపపిల్లలను వదులుతున్న ప్రభుత్వం తమదేనని మంత్రి పేర్కొన్నారు. మత్స్యకారులకు ఉచితంగా వాహనాలను అందించినట్లు వివరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు కోట్ల చేపపిల్లలను వదులనున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు 80 లక్షల చేపపిల్లలను వదిలినట్లు వివరించారు.

ఆనందంగా జీవించాలన్నదే సీఎం లక్ష్యం

ABOUT THE AUTHOR

...view details