తెలంగాణ

telangana

ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

By

Published : Dec 16, 2019, 3:53 PM IST

Updated : Dec 16, 2019, 4:16 PM IST

ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలైనా, తన ప్రాణాల్ని పణంగా పెట్టిన డ్రైవర్ ప్రయాణికులను రక్షించాడు. ఈ ఘటన నిజమాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో జరిగింది.

accident at dichpally nizamabad driver died
ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లిలో ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్​ అవ్వగా... డ్రైవర్​ తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రయాణికులను రక్షించాడు. తాను ప్రాణాలొదిలి బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాడు. హైదరాబాద్​ నుంచి బోధన్​కు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు డిచ్​పల్లి సమీపంలోకి రాగానే బస్సు బ్రేకులు పనిచేయలేదు.

అప్రమత్తమైన డ్రైవర్ మారుతి... బస్సును రోడ్డు పక్కనున్న ఇనుప కమాన్​కు ఢీకొనగా బస్సు ఆగింది. ప్రమాదంలో గాయపడ్డ డ్రైవర్​ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. మరో ఇద్దరికి గాయాలవ్వగా నిజామాబాద్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మరణించడం పట్ల ప్రయాణికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ప్రయాణికుల కోసం ప్రాణాలు వదిలిన డ్రైవర్

ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా

Last Updated : Dec 16, 2019, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details