బ్యాలెట్ పత్రాలు పరిశీలించిన జేసీ
జిల్లా, మండల పరిషత్ తొలి విడత ఎన్నికల ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. నిర్మల్ జిల్లా పాలనాధికారి కార్యాలయంలో జేసీ భాస్కర్ బ్యాలెట్ పత్రాలు పరిశీలించారు.
బ్యాలెట్ పత్రాలు పరిశీలిస్తున్న జేసీ
ప్రాదేశిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జేసీ భాస్కర్ పెంబి, ఖానాపూర్ మండలాల జడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ పత్రాలు పరిశీలించారు. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.