తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాలల్లో వంట గదుల్లేక ఏజెన్సీల పాట్లు

పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న ఏజెన్సీలకు సరైన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాయి. వంట గదుల్లేక ఎండకి ఎండుతూ.. వానలో తడుస్తూ వండి పెట్టాల్సిన పరిస్థితి. నారాయణ పేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

By

Published : Sep 25, 2019, 4:32 PM IST

పాఠశాలల్లో వంట గదుల్లేక ఏజెన్సీల పాట్లు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు చేరడంలో అనేక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. నారాయణ పేట జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో వంట గదుల్లేక వంట ఏజెన్సీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నిచోట్ల గదులు నిర్మించినా అవి వంట చేసేందుకు అనువుగా లేవు. కనీసం ఇద్దరు మనుషులు కూర్చునేందుకు... వంట పాత్రలు తీసుకెళ్లేందుకు కూడా వీలుగా లేవని సిబ్బంది వాపోతున్నారు.

18 ఏళ్లుగా ఆరుబయటే...

జిల్లా కేంద్రంలోని వైదిక పాఠశాలలో 18 ఏళ్లుగా ఏజెన్సీ నిర్వాహకులు ఆరు బయటే వంట చేస్తున్నారు. వర్షమొస్తే తమ తిప్పలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని వాపోతున్నారు. దాతలెవరైనా స్పందించి వంట గదిని నిర్మించాలని కోరుతున్నారు.

దాతలెవరైనా సాయం చేయండి

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన వంటగదులు అనుకూలంగా లేకపోవడం... చాలా పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. అధికారులు, దాతలెవరైనా స్పందించి వంటగదిని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పాఠశాలల్లో వంట గదుల్లేక ఏజెన్సీల పాట్లు

ఇదీ చూడండి: అక్కడి విద్యార్థులు వర్షం కురవొద్దని కోరుకుంటారు... ఎందుకంటే?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details