తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతీ ఓటరు తప్పనిసరిగా ఓటేయాలి: డీఆర్డీఓ

ఓటరు చైతన్యంపై అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన డీఆర్డీఓ పీడీ

By

Published : Apr 4, 2019, 3:39 PM IST

నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో ఓటరు చైతన్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం డీఆర్డీఓ పీడీ రఘువీరా రెడ్డి ఆ శాఖ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. దివ్యాంగులను ఆటోల ద్వారా పోలింగ్ కేంద్రానికి తరలించాలని సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు మహిళల ర్యాలీ నిర్వహించనున్నామని తెలిపారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి : పీడీ రఘువీరా రెడ్డి

ABOUT THE AUTHOR

...view details