తెలంగాణ

telangana

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2023, 2:25 PM IST

Special Story On Nalgonda Shaik Sayyed PhD : కష్టం అతణ్ని ఆపలేకపోయింది. పేదరికం అతడి పట్టుదల ముందు చిన్నబోయింది. బాల్యమంతా సరస్వతి మాత ఒడిలోనే గడిచినా.. లక్ష్మీ కటాక్షం మాత్రం లేకుండా పోయింది. ఫలితంగా ఇంటినిండా కష్టాలు. చదువుకు అడుగడుగునా అడ్డంకులు. పిరికివారికి అవి అవరోధాలు కానీ.. ఇతని మొక్కవోని దీక్ష ముందు పేదరికం పరారైంది. చదువే ప్రపంచంగా బతికిని యువకుడు ఇటీవలే ప్రఖ్యాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ సాధించాడు. తినడానికి తిండి లేని స్థాయి నుంచి డాక్టరేట్‌ సాధించే స్థాయికి ఎదిగిన ఆ యువకుడి స్ఫూర్తివంతమైన ప్రస్థానమిది.

Special Story
Special Story On Nalgonda Shaik Sayyed PhD

Special Story On Nalgonda Shaik Sayyed PhD పట్టుదల ఉంటే నిరూపించుకోవచ్చు ఎలాగైనా సాధించవచ్చనేది ఆ యువకుడి బాట

Special Story On Nalgonda Shaik Sayyed PhD : ప్రపంచంలో చదువొక్కటే మన స్థాయిని పెంచగలదు. లక్ష్య ఛేదన చేయాలనే బలమైన సంకల్పం ఉంటే మనిషిని ఆపగలిగేది ఈ ప్రపంచంలోనే లేదు. ఇలాంటి వాక్యాలనేస్ఫూర్తిగా తీసుకుని ఆ యువకుడి ప్రస్థానం ప్రారంభమైంది. ఫలితంగా అతడు పేదరికాన్ని జయించాడు. డాక్టరేట్‌ సాధించి ఊరుకు, కుటుంబానికి గర్వకారణంగా నిలిచాడు.

Nalgonda Young Man Came From Poverty Got PhD :ఈ యువకుడి పేరు షేక్‌ సయ్యద్‌ మియా. నల్గొండ జిల్లా చండూరు మండలం కస్తాల ఇతని స్వస్థలం. తల్లిదండ్రులు షేక్‌ హుస్సేన్‌, మదార్‌ బీ. వారిది పేద కుటుంబం. ఇతనికి మాత్రం చదువంటే పంచ ప్రాణాలు. ఆ క్రమంలో పదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి మరణం ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. చదువు ఆపేద్దామనుకున్నాడు సయ్యద్. కానీ గురువుల ప్రోత్సాహంతో 10వ తరగతి పూర్తి చేశాడు.

తండ్రి చనిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డా :తర్వాత ఇంటర్‌ నల్గొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివి జిల్లా ప్రథమ ర్యాంకు సాధించడంతో జాతీయ ఫెల్లోషిప్‌ స్కాలర్‌షిప్‌(National Fellowship Scholarship)కు ఎంపికయ్యాడు. తర్వాత డిగ్రీ.. రాంరెడ్డి అనే లెక్చరర్ ఆర్థికసాయంతో పూర్తి చేశాడు సయ్యద్. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేసి.. అందులోనూ మొదటి ర్యాంకర్‌గా నిలిచాడు. అక్కడ డాక్టర్ జీ అంజయ్య తనను ఇంటి మనిషిలా చూసి, ఈ స్థాయిలో ఉండడానికి కారణం అంటున్నాడు సయ్యద్. తండ్రి చనిపోయిన తర్వాత తన పేదరికం గురించి, అతడు ఎదుర్కొన్న ఇబ్బందులుగురించి చెబుతున్నాడు. చదువు సాగిన విధానం, తన పేదరికం గురించి చెబుతూ ఇవేవీ తనకు అడ్డుకాలేదని చెబుతున్నాడు. మనిషికి ఆపద సమయాల్లో ధైర్యంగా ముందుకెళ్లాలని తన జీవితాన్నే ఉదహరిస్తున్నాడు సయ్యద్‌ మియా.

"నా చదువుకు స్నేహితులు బాగా సహయం చేశారు. ఆ తర్వాత రాంరెడ్డి మాస్టారు.. మా గ్రామ ప్రజలందరీ సేవ అసలు మర్చిపోను. నాకు ప్రతిక్షణం అండదండగా నిలిచింది గ్రామ ప్రజలు.. నా స్నేహితులే. నేను ఏ కష్టాల్లో ఉన్న నన్ను ముందుండి నడిపించి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. నా రీసెర్చ్​కి ఎంతగానో వారు సహాయపడ్డారు. నాకు ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉపాధ్యాయ వృతిలో స్థిరపడదామని అనుకుంటున్నాను." -డాక్టర్ షేక్‌ సయ్యద్ మియా, కస్తాల

Portraits with Millets : చిరుధాన్యాలతో జీవం ఉట్టిపడే అందమైన చిత్రాలు

ఓయూ నుంచి చరిత్ర విభాగంలో పీహెచ్​డీ :ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) నుంచి చరిత్ర విభాగంలో పీహెచ్​డీ పొందాడు. ట్రేడ్ అండ్ కామర్స్ ఇన్ ఆంధ్రదేశ 1163 ఏడీ -1687ఏడీ అంశంపై పరిశోధన పూర్తి చేశాడు. అయితే ఈ క్రమంలో కష్టాలు భరించలేక చదువే మానేద్దామనుకునే పరిస్థితి వచ్చిందన్నాడు. ఆ సమయాల్లో తనకు మిత్రులే అండగా నిలిచారని చెబుతున్నాడు.

Special Story About Nalgonda PhD Young Man :చదువును నమ్ముకున్న తనకు 2019లో జూనియర్‌ పంచాయతీ కొలువు వచ్చిందని చెప్పాడు. అప్పటి నుంచి కష్టాల నుంచి కాస్త ఉపశమనం లభించిందని అంటున్నాడు. అయితే పీహెచ్​డీ సాధించాలనేలక్ష్యం.. తనను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోనివ్వలేదని పేర్కొన్నాడు. రోడ్డు పక్కన చిన్న టీ కొట్టుతో కుటుంబాన్ని పోషించానని, తన పెద్ద కొడుకు పెద్ద దిక్కయ్యాడని భావోద్వేగానికి గురవుతోంది సయ్యద్‌ తల్లి మదార్‌బీ. పిల్లలకు తిండి పెట్టలేక ఊరిలో యాచించిన పరిస్థితి గుర్తుకు వస్తే గుండె చెరువవుతోందంటుంది. అన్నీ తానై వ్యవహరించిన సయ్యద్‌... పది మందిలో తలెత్తుకునేలా చేశాడని గర్వంగా చెబుతోందీ ఆ తల్లి.

Beach Volleyball India team Captain : నల్గొండ టూ థాయ్​లాండ్.. బీచ్ వాలీబాల్ కెప్టెన్ ప్రయాణం సాగిందిలా

"చిన్నప్పటీ నుంచి ఎప్పుడు చదువుకుంటూ ఉండేవాడు. ఎంతో కష్టపడి చదివాడు. మన పరిస్థితిని అర్థం చేసుకొని ఉదయం సాయంత్రం చదువుకుంటూ ఉండేవాడు. మా అబ్బాయి చదువుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. దానికోసం ఎన్నోసార్లు కూలి పనులకు కూడా వెళ్లాడు. అలాగే చెల్లి పెళ్లి కూడా చేపించాడు. తమ్ముడిని ఉన్నత చదువులు కూడా చదివిస్తున్నాడు."-సయ్యద్ తల్లి

సయ్యద్‌ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటున్నారు అతని మిత్రులు. అతడు తమ మిత్రుడు అవడం చాలా గర్వంగా ఉందంటున్నారు. కష్టాలు మనిషిలోని సత్తాను బయటకు తీసేందుకే వస్తాయి. అలా కష్టాల్ని మిత్రుల, గురువుల సహకారంతో ఎదుర్కొని తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశావాహ దృక్పథాన్ని కోల్పోకూడదని చెబుతున్నాడు డాక్టర్ షేక్‌ సయ్యద్‌ మియా.

Gongadi Wool Shoes : 'గొంగడి'తో షూస్.. ఐడియా అదిరింది బాస్

Special Story On Dundigal AIR Force Academy : 'దేశ సేవ చేయడమే మా అంతిమ లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details