తెలంగాణ

telangana

By

Published : Feb 21, 2021, 1:34 PM IST

ETV Bharat / state

జూనూతల గ్రామం నుంచి భాజపా 'పోరుబాట'

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతల నుంచి సాగర్​ భాజపా ఇన్​ఛార్జి కంకణాల నివేదిత పోరుబాట ప్రారంభించారు. నాగార్జునసాగర్​ నియోజకవర్గాన్ని తెరాస నిర్లక్ష్యం చేసిందని.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరుబాటను ప్రారంభించినట్లు నివేదిత తెలిపారు.

porubata from junuthala
జూనూతల నుంచి పోరుబాట

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గపరిధిలో ఉన్న సమస్యలపై సాగర్​ భాజపా ఇన్​ఛార్జి కంకణాల నివేదిత.. గుర్రంపోడు మండలం జూనూతల గ్రామం నుంచి పోరుబాట ప్రారంభించారు. ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కారానికి కృషి చేస్తానని నివేదిత అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలపై పోరుబాట ద్వారా పర్యటించనున్నట్లు ఆమె తెలిపారు.

గతంలో కాంగ్రెస్, ఇప్పడు తెరాస.. సాగర్​ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశాయని నివేదిత ఆరోపించారు. సమస్యలు తీరడం లేదు సరికదా కొత్త సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను గాలికి వదిలేశాయని మండిపడ్డారు. అధికారం కాపాడుకోవడం కోసమే తెరాస ఆరాటమంతా అని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో మంచినీటి, పారిశుద్ధ్య, డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోరుబాటలో నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'తెరాస నాయకుడు నా పొలాన్ని ఆక్రమించుకున్నారు'

ABOUT THE AUTHOR

...view details