తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2020, 5:30 PM IST

ETV Bharat / state

నల్గొండ పురపాలిక వైస్​ ఛైర్మన్​గా... అబ్బగోని రమేశ్

ముఖ్యమంత్రి కేసీఆర్​ మీద నమ్మకంతో తెలంగాణ ప్రజలు పురపాలక ఎన్నికల్లో తెరాసకు పట్టం కట్టారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపాలిటీ వైస్​ఛైర్మన్​ ఎన్నిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

abbagoni ramesh elected as the vice chairman of nalgonda municipality
నల్గొండ పురపాలిక వైస్​ ఛైర్మన్​గా... అబ్బగోని రమేశ్

నల్గొండ పురపాలిక వైస్​ ఛైర్మన్​గా... అబ్బగోని రమేశ్

నల్గొండ మున్సిపల్​ ఛైర్మన్​ ఎన్నిక మాదిరిగానే వైస్​ఛైర్మన్​ ఎన్నిక కూడా సాఫీగా సాగింది. పుర ఎన్నికల్లో తెరాస-20, కాంగ్రెస్​-20, భాజపా-6, ఎంఐఎం-1, స్వతంత్ర అభ్యర్థి-1 గెలుపొందారు. ఇందులో ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు.

ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల 5 ఓట్లతో మొత్తం తెరాసకు 27 మంది మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీతో నల్గొండ మున్సిపల్​ ఛైర్మన్​ పీఠం తెరాస కైవసం చేసుకుంది.

వైస్​ ఛైర్మన్​ ఎన్నికలోనూ... తెరాసకు 27 మంది మెజార్టీ ఉంది. 47వ వార్డు నుంచి కౌన్సిలర్​గా ఎన్నికైన అబ్బగోని రమేశ్​ను ఏకగ్రీవంగా నల్గొండ పురపాలిక వైస్​ ఛైర్మన్​గా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి.. సీఎం కేసీఆర్​ మీద నమ్మకంతోనే పుర ఎన్నికల్లో ప్రజలు తెరాసకు పట్టం కట్టారని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి నల్గొండకు వస్తారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details