తెలంగాణ

telangana

సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీకి వెళ్తే తప్ప పూట గడవని స్థితి ఆ దంపతులది. భర్తకు వచ్చే రెండు వందల రూపాయల కూలే వారికి జీవనాధారం. ఉన్నంతలోనే సంతోషంగా సాగే జీవితం. ఇంతలోనే వారికి పెద్ద కష్టమొచ్చింది. వాళ్ల తొమ్మిది నెలల కుమారుడి గుండెకు రంధ్రం ఉందని... ఆపరేషన్ చేయకపోతే కష్టమేనని చెప్పిన వైద్యుల మాట వారిని కుంగదీసింది.

By

Published : Nov 24, 2019, 8:35 PM IST

Published : Nov 24, 2019, 8:35 PM IST

సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

ఆ తల్లిదండ్రులు ఎక్కని మెట్టు లేదు... తొక్కని గడప లేదు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు. అతుకుల బొతుకుల జీవితంలో.. కొడుకునెలా కాపాడుకోవాలో తెలియని ధైన్యం వాళ్లది. ఈ కన్నీటి గాథ... నల్గొండకు చెందిన వెంకటేశ్​, పావని దంపతులది.

సాయం చేయండి.. పసివాడికి ప్రాణం పోయండి

నల్గొండకు చెందిన ఆకుల వెంకటేశ్​, పావని దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు విఘ్నేశ్​ ఉన్నాడు. వెంకటేశ్​ దినసరి కూలీ. పని దొరికితే వచ్చే ఆ కూలీ డబ్బులపైనే ఆ కుటుంబం ఆధారపడి ఉంది. ఉన్న దాంట్లో సద్దుకుపోయే వారికి... కొడుకు అనారోగ్యం కష్టాల్లోకి నెట్టింది. విఘ్నేశ్​ శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండడం వల్ల ఆస్పత్రులు చుట్టు తిరిగారు. అయినా నయం కాకపోవడం వల్ల అప్పు చేసి హైదరాబాద్​లోని నిలోఫర్, రెయిన్ బో ఆస్పత్రుల్లో చూపించగా హృదయ సంబంధిత సమస్యగా గుర్తించారు.

ఆపరేషన్​కు రూ.5 లక్షలు

గుండెకు రంధ్రం పడ్డట్లు గుర్తించిన వైద్యులు వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్​కు రూ.5 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆ దంపతులిద్దరు ఇప్పుడు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కన్నీటితో వేడుకుంటున్నారు.

దాతల కోసం

ఇప్పటికే తాళిని తాకట్టు పెట్టి, అప్పుచేసి ఆస్పత్రులు చుట్టు తిరిగామని మొరపెట్టుకోగా కనీసం రూ.3 లక్షలు వరకైనా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని పావని తెలిపారు. మనసున్న మారాజులు స్పందించి ఆ చిన్నారికి ప్రాణం పోయాలని కోరుతున్నారు స్థానికులు.

ఇదీ చూడండి: పైవంతెన ప్రమాదాలపై జీహెచ్​ఎంసీ అప్రమత్తం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details