తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్య కాపురానికి రాలేదని గొంతు కోసుకున్న భర్త

భార్య కాపురానికి రావడంలేదని ఓ భార్త తాగిన మైకంలో నాగర్​ కర్నూలు పోలీస్​స్టేషన్​ ముందు గొంతు కోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు.

By

Published : Sep 14, 2019, 6:57 PM IST

నిజాముద్దీన్​ ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీస్​

నాగర్​ కర్నూలు జిల్లా బిజినపల్లికి చెందిన నిజాముద్దీన్​ అతని భార్యకు కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇల్లాలు కాపురానికి రావడం లేదంటూ తరుచూ తాగిన మైకంలో పోలీస్ స్టేషన్​కు వెళ్తూ ఆత్మహత్య చేసుకుంటానని విసిగించేవాడు. కానీ ఈ సారి ఏకంగా నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్​కు వచ్చి ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించాడు. పోలీసులు బిజినపల్లి పోలీస్ స్టేషన్​కు వెళ్లమని చెప్పారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిజాముద్దీన్​ బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు. గమనించిన పోలీసులు అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

భార్య కాపురానికి రాలేదని గొంతు కోసుకున్న భర్త

ABOUT THE AUTHOR

...view details