తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సులు ప్రారంభం.. కొనుగోళ్లకు బయలు దేరిన ప్రజలు

ములుగు జిల్లాకు ఈరోజు బస్సులు ప్రారంభమయ్యాయి. హనుమకొండ నుంచి ఏటూరు​నాగారం వెళ్లే బస్సులు ములుగు మీదుగా పోవడం వల్ల బస్టాండ్ అంతా ప్రయాణికులతో నిండిపోయింది.

By

Published : May 19, 2020, 7:40 PM IST

People go out for purchases in bus journey in mulugu
బస్సులు ప్రారంభం.. కొనుగోళ్లకు బయలు దేరిన ప్రజలు

ములుగు జిల్లాకు ఈరోజు బస్సులు మొదలయ్యాయి. ఇన్ని రోజులుగా బయటకు రాని ప్రజలు కొనుగోళ్ల కోసం పట్టణానికి బయలు దేరారు. హనుమకొండ నుంచి ఏటురు​నాగారం వెళ్లే బస్సులు ములుగు మీదుగా వెళ్లడం వల్ల బస్టాండ్ అంతా కిక్కిరిసిపోయింది.

ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు ఎక్కాలని ఆర్టీసీ సిబ్బంది సూచించారు. ఇద్దరు కూర్చునే సీట్లో ఒకరు, ముగ్గురు కూర్చునే సీట్లో ఇద్దరు కూర్చోవాలని నిర్దేశించారు.

ఇదీ చూడండి :'కేసీఆర్​తో జగన్​ భేటీ తర్వాతే ఏపీ జీవో ఇచ్చింది'

ABOUT THE AUTHOR

...view details