తెలంగాణ

telangana

ETV Bharat / state

గెలిపించిన గ్రామాన్ని దత్తత తీసుకుంటా: ఎర్రబెల్లి

పార్లమెంట్​ ఎన్నికల్లో ఏ ఊరి ప్రజలు ఎక్కువ మెజార్టీతో మహబూబాబాద్​ ఎంపీ అభ్యర్థి మాలోత్​ కవితను గెలిపిస్తారో ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు.

By

Published : Mar 28, 2019, 6:10 AM IST

ములుగు తెరాస కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి

ములుగు తెరాస కార్యకర్తల సమావేశంలో ఎర్రబెల్లి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు ములుగును జిల్లాగా చేస్తానని ప్రకటించిన కేసీఆర్​ ఆ మాట నిలబెట్టుకున్నారని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తెరాస కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. పోడు భూములు సాగు చేసే రైతులకు శాశ్వత పట్టాలందిస్తానని తెలిపారు. మహబూబాబాద్ అభ్యర్థి కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details