తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy: ఉప్పల్​ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా

మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి(Revanth Reddy) ఉప్పల్‌, రామంతాపూర్​లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉప్పల్‌ నియోజకవర్గం సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ టీకా రెండో డోసు వేయించుకున్నారు.

By

Published : Jun 3, 2021, 4:52 PM IST

Revanth Reddy
రేవంత్​ రెడ్డి

మేడ్చల్​ జిల్లా ఉప్పల్‌, రామంతాపూర్​లో ఎంపీ రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ రజిత పరమేశ్వర్‌రెడ్డితో కలిసి
పర్యటించారు. హరిజనబస్తీలో రూ.22.50 లక్షలతో నిర్మిస్తున్న మహిళ భవనం, ఇందిరానగర్​లో రూ.42లక్షలతో చేపడుతున్న
షాదీఖానా భవనం, కృష్ణారెడ్డినగర్‌ కాలనీలో రూ.55లక్షలతో నిర్మిస్తున్న కల్వర్ట్‌ నిర్మాణం, లక్ష్మీనారాయణ కాలనీలో రూ.26.50 లక్షతో నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ పనులను శంఖుస్థాపన చేశారు.

ఉప్పల్‌ నియోజకవర్గం సమాగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు రేవంత్​ రెడ్డి చెప్పారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ టీకా రెండో డోసును రేవంత్‌రెడ్డి వేయించుకున్నారు. అక్కడి నుంచి రామంతాపూర్‌ గాంధీనగర్‌లోని సూపర్​ స్ప్రెడర్లకు వేసే టీకా కేంద్రాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి:Wonder: చనిపోయిందనుకొని అంత్యక్రియలు.. కానీ అంతలోనే...!

ABOUT THE AUTHOR

...view details