తెలంగాణ

telangana

'ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానా వినియోగించుకోండి'

జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా ఏర్పాటైన 45 బస్తీ దవాఖానాలకు మంత్రులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. బస్తీ దవాఖానాలు ప్రారంభించి... ప్రతి ఒక్కరు వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

By

Published : May 22, 2020, 2:42 PM IST

Published : May 22, 2020, 2:42 PM IST

loacl-hospital-start-at-uppal-by-mayer-bonthu-rammohan
'ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానను వినియోగించుకోండి'

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డితో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ బస్తీ దవాఖానను ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బందిని నియమించి పేదలకు మెరుగైన సేవలు అందిస్తామని రామ్మోహన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ బస్తీ దవాఖానాను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇప్పటికే మహానగరంలో 123 బస్తీ దవాఖానాలు ఉండగా... మరో 45 ఆస్పత్రులకు మంత్రులు, ప్రజాప్రతినిధులు నేడు శ్రీకారం చుట్టారు.

ABOUT THE AUTHOR

...view details