తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస సన్నాహాలు షురూ

తెలంగాణలో 16 లోక్​సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు తెరాస సన్నాహాలు ప్రారంభించింది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కరీంనగర్​కు బయలుదేరారు.

By

Published : Mar 6, 2019, 12:22 PM IST

సభకు బయలుదేరిన కేటీఆర్​

లోక్​సభ ఎన్నికల సమరానికి తెరాస శంఖారావం పూరించింది. 16 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేటి నుంచి పార్టీ శ్రేణులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు దిశానిర్దేశం చేయనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశానికి బయలుదేరిన కేటీఆర్​కు శామీర్ పేట్ వద్ద కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పార్టీ జెండా ఆవిష్కరించి కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ అభివాదం చేశారు.

ఇవీ చదవండి: 'తెరాస శంఖారావం'

ABOUT THE AUTHOR

...view details