తెలంగాణ

telangana

By

Published : Jun 11, 2020, 8:38 PM IST

ETV Bharat / state

ఈ ఆటో డ్రైవర్​ ఎందరికో ఆదర్శం... ఎందుకంటే..

రోడ్డుపై రూపాయి నాణెం కనబడగానే... చుట్టుపక్కల చూసి చటుక్కున జేబులో వేసుకునే వాళ్లే ఎక్కువ మంది ఉన్న నేటి సమాజంలో... రోడ్డుపై దొరికిన బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పి... బాధితులకు అందజేశాడో ఆటో డ్రైవర్​. అతని నిజాయితీకి మెచ్చి పోలీసులు వెయ్యి రూపాయల రివార్డు అందించారు. ఈ ఘటన కీసర ఠాణా పరిధిలో జరిగింది.

an auto driver handed over to police a bag
ఈ ఆటో డ్రైవర్​ ఎందరికో ఆదర్శం... ఎందుకంటే..

నేను కష్టపడి సంపాదించింది పావలా అయినా వదులుకోను... నాది కానిది ఎంతైనా నాకొద్దు అనుకునే వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అలాంటి కోవలోకే చెందుతాడు మేడ్చల్​ జిల్లా జవహార్​నగర్​కు చెందిన ఆటో డ్రైవర్​ గంటి నరేశ్​ గౌడ్​. రోడ్డుపై దొరికిన బ్యాగును నిజాయితీగా పోలీసులకు అప్పజెప్పి... వారి ద్వారా బాధితులకు అందిజేసిన నరేశ్​ గౌడ్​ను కీసర సీఐ నరేందర్​ గౌడ్​ అభినందించారు.

అసలేమైందంటే...

కిరాణా సామాను కోసం కీసర చౌరస్తాకు వచ్చిన రాధిక... తన ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న క్రమంలో హ్యండ్​ బ్యాగ్​ తెగిపడిపోయింది. అదే మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్​ నరేశ్​గౌడ్​ రోడ్డుపై ఉన్న బ్యాగును గుర్తించి... కీసర ఠాణాలో అందజేశాడు. బ్యాగును తెరిచి చూడగా.. 18,000 నగదు, బంగారు కమ్మలు, స్మార్ట్​ఫోన్​ ఉన్నాయి. బాధితులను గుర్తించిన పోలీసులు వారిని పిలిచి బ్యాగును అందజేశారు. పోయిందనుకున్న నగదు, వస్తువులు తెచ్చి ఇచ్చిన ఆటోడ్రైవర్​కు బాధిత మహిళ ధన్యవాదాలు తెలిపింది. నిజాయితీగా వ్యవహరించిన నరేశ్​ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సీఐ సూచించారు.

ఇదీ చూడండి:అమ్మా.. అని పిలిపించుకోకముందే.. ఆ తల్లి..

ABOUT THE AUTHOR

...view details