తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలయ రేకుల షెడ్డు కూల్చినందుకు భక్తుల ఆగ్రహం

మేడ్చల్​ జిల్లాలోని కృష్ణానగర్​లో మైసమ్మ, నల్లపోచమ్మ ఆలయంలో నిర్మించిన రేకుల షెడ్డును అధికారులు ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా కాప్రా సర్కిల్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అధికారులు సమస్య పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.

By

Published : Aug 8, 2019, 5:31 PM IST

రేకుల షెడ్డు

మేడ్చల్ జిల్లాలోని కాప్రా సర్కిల్ హౌసింగ్ బోర్డు డివిజన్ కృష్ణా నగర్​లో మైసమ్మ, నల్ల పోచమ్మ ఆలయంలో నిర్మించిన రేకుల షెడ్​ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్​ఎంసీ అధికారులు రాత్రికి రాత్రే కూల్చేశారని భక్తులు ధర్నాకు దిగారు. ఆలయ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా షెడ్డును కూల్చేయడం దారుణమని కాప్రా సర్కిల్​ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అధికారులు వచ్చి దీనికి సమాధానం చెప్పే వరకూ నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. కొత్త రేకుల షెడ్డు నిర్మించడం గానీ... ప్రత్యామ్నాయం గానీ చూపించాలని భక్తులు డిమాండ్​ చేశారు.

ఆలయ రేకుల షెడ్డు కూల్చినందుకు భక్తుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details