తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాళీ బిందెళతో కదంతొక్కిన మహిళలు

మెదక్​ జిల్లా నర్సాపూర్​ పట్టణంలోని నీటి సమస్యలను పరిష్కరించాలంటూ.. స్థానికులు మున్సిపల్ కార్కాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Sep 20, 2019, 12:54 PM IST

ఖాళీ బిందెళతో కదంతొక్కిన మహిళలు

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో పలు విధుల్లో తాగునీరు రావడంలేదంటూ ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట బిందెలతో బైఠాయించి నినాదాలతో నిరసన తెలియజేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా.. చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మేనేజర్ శ్రీదేవి రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.

ఖాళీ బిందెళతో కదంతొక్కిన మహిళలు
ఇదీచూడండి: మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా

ABOUT THE AUTHOR

...view details