తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

సమస్యల పరిష్కారించాలని మెదక్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమ్మె చేశారు.

By

Published : Jul 23, 2019, 7:23 PM IST

సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

క్షయ నివారణ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మెదక్​ జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన క్షయవ్యాధి నిర్మూలనకు 22 సంవత్సరాలుగా కృషి చేస్తున్నా... ఎటువంటి ఆరోగ్య భద్రత సదుపాయాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఆరోగ్య భద్రత కార్డు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఆంధ్రప్రదేశ్​లో అమలు చేస్తున్న జీవో నెంబర్ 27 ప్రకారం తెలంగాణలో వేతనాల పెంచి ఏప్రిల్​ 2018 నుంచి ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు క్షయ వ్యాధి సోకితే... నయమయ్యే వరకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కోరారు.

సమస్యల పరిష్కారానికి క్షయ నివారణ ఉద్యోగుల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details