తన భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన ఈ నెల 19న మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయలలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామానికి చెందిన దొంతి నారాయణను అదే గ్రామానికి చెందిన కొలను రామకృష్ణ, బీరంగూడ గ్రామానికి చెందిన కొమ్ము ప్రసాద్లు కలిసి చంపారు. ఆయుధంతో పొడిచి బండరాయితో మోది శవాన్ని గుర్తుపట్టకుండా యాసిడ్ పోశారని మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు.
దొంతి నారాయణ తన అవసరాల నిమిత్తం తన స్నేహితుడు కొలను రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకుంటూ మళ్లీ ఇచ్చేవాడు. ఇదే క్రమంలో ఈనెల 11నపదివేల రూపాయలుఅప్పుగా తీసుకున్నాడు. తిరిగి ఇచ్చేందుకు నారాయణ అప్పిచ్చిన తన మిత్రుడు రామకృష్ణ ఇంటికి వచ్చాడు. తన భార్యతో నారాయణ మాట్లాడుతుండటం రామకృష్ణకు అనుమానం తెప్పించింది.