తెలంగాణ

telangana

కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి: అదనపు కలెక్టర్​

By

Published : Sep 2, 2020, 9:13 AM IST

మెదక్​ జిల్లా నర్సాపూర్​ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని అధికారులకు అదనపు కలెక్టర్​ నగేశ్​ సూచించారు. హాస్పటల్​లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

medak district additional collector nagesh sudden visit to the narsapur govt hospital
కరోనా పరీక్షల సంఖ్య పెంచాలి: అదనపు కలెక్టర్​

మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ నగేశ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి వైద్య సేవలు గురించి ఆరా తీశారు. రోగులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలపై వైద్యాధికారులను వివరాలు అడిగారు.

హాస్పటల్​లోని కొంతమంది వైద్యులు సరిగా చూడడం లేదని ఫిర్యాదు రావడం మేరకు తనిఖీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. మరొకసారి ఆకస్మికంగా వచ్చి పరిశీలిస్తామని పేర్కొన్నారు. కరోనా టెస్టులు సంఖ్య పెంచాలని అధికారులకు సూచించారు.

ఇవీచూడండి:వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details