తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మెదక్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు.

By

Published : Aug 8, 2019, 11:19 AM IST

Updated : Aug 8, 2019, 1:05 PM IST

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న పాఠశాలల్లో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మెదక్ పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే తెలంగాణకు హరితహారం చాలా అవసరమన్నారు.

గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కోటి మొక్కలు నాటాలని ప్రతి గ్రామానికి 40 లక్షల చొప్పున నిర్దేశించారు. కానీ సరైన వర్షపాతం లేకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోయామన్నారు. ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ఇదీ చూడండి : రైల్వేస్టేషన్​ పనులపై పద్మాదేవేందర్​ రెడ్డి ఆగ్రహం

Last Updated : Aug 8, 2019, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details