తెలంగాణ

telangana

నాన్న లేడు..అమ్మ లేదు..అనాథలుగా పిల్లలు

చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. 20 రోజుల క్రితం తల్లి మరణించింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. అపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

By

Published : May 12, 2020, 11:23 AM IST

Published : May 12, 2020, 11:23 AM IST

tribal childrens loose parents and face the problems in Manchiryala district
చేయూత కోసం గిరిజన పిల్లల చూపులు

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం గట్రావుపల్లి గ్రామానికి చెందిన భీం రావు కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. అతని భార్య అంబిక 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. తల్లీదండ్రులు లేక ఆ ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. పెద్ద అమ్మాయి గంగుభాయి 10 వ తరగతి, రెండో అమ్మాయి 8 వ తరగతి, అందరి కన్నా చిన్నవాడు హన్మంతరావు 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులను పోగొట్టుకోవటం వల్ల వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details