తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం'

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం  అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్​ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల సమీపంలోని అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం జలజాతర వనభోజనాలల్లో  పాల్గొన్నారు.

By

Published : Jul 16, 2019, 11:24 PM IST

భోజనం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజ్ వద్ద​ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్​తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించారని మంత్రిలు కొనియాడారు.

కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details