తెలంగాణ

telangana

ETV Bharat / state

పొట్టకూటి కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి

ఇక్కడ ఉపాధి లేక పొట్టకూటి కోసం దేశంకాని దేశం వెళ్లారు. అక్కడ విధి వాళ్లను మృత్యు ఒడిలోకి తీసుకెళ్లింది. మంచిర్యాల జిల్లాకు చెందిన ఉప్పు మల్లేశ్​, నాంపల్లి రాజు సౌదీలోని రీయాద్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

By

Published : Jul 22, 2019, 6:34 AM IST

Updated : Jul 22, 2019, 7:30 AM IST

మృతులు మల్లేష్​​, రాజు

సౌదీలోని రియాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంచిర్యాల జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. ద్విచక్రవాహనంపై పనులకు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్రక్కు అతివేగంగా ఢీకొట్టడం వల్ల ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జన్నారం మండలం రోటీగూడకు చెందిన ఉప్పు మల్లేశ్‌ (40), దండేపల్లి మండలం గుడిరేవుకు చెందిన నాంపల్లి రాజు (24)గా గుర్తించారు. వీరిద్దరూ మూడేళ్ల క్రితం సౌదీ వెళ్లారు. మల్లేష్‌కు భార్య భాగ్య, డిగ్రీ చదువుతున్న ఇద్దరు కుమారులు రాకేశ్‌, వినయ్‌ ఉన్నారు. రాజుకు తల్లిదండ్రులు సత్తయ్య, రాజవ్వ, తమ్ముడు వెంకటేశ్‌, చెల్లెలు మౌనిక ఉన్నారు. పొట్టకూటి కోసం వెళ్లి మృత్యువాత పడడంతో ఆ రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Last Updated : Jul 22, 2019, 7:30 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details