తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంపల్లిలో ఈవీఎంల మొరాయింపు

రాష్ట్రంలో అక్కడక్కడ ఈవీఎంలు పనిచేయక ఇబ్బందులు తప్పలేదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓటింగ్​ యంత్రాల మొరాయింపుతో కొద్దిసేపు పోలింగ్​ నిలిచిపోయింది. పోలింగ్​ ఆలస్యంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

By

Published : Apr 11, 2019, 1:30 PM IST

ఈవీఎంల మొరాయింపు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈవీఎంల మొరాయింపు అధికారులకు తలనొప్పిగా మారింది. ఉదయం 7 గంటల నుంచి యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. బెల్లంపల్లి బస్తీ పోలింగ్​ కేంద్రం 58, బాబు క్యాంపు బస్తీలోని 82వ పోలింగ్​ కేంద్రంలో ఓటింగ్​ యంత్రాలు రెండు సార్లు పనిచేయలేదు. అలాగే కాసిపేట మండలం కోమటిచేను గ్రామం 19వ పోలింగ్​ కేంద్రంలో ఈవీఎంల మొరాయింపుతో గంట ఆలస్యంగా పోలింగ్​ ప్రారంభమైంది. కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపు

ABOUT THE AUTHOR

...view details