తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ డబ్బాలు అద్భుతం చేశాయి...!

శౌచాలయాలు లేక  విద్యార్థులు పడుతున్న అవస్థలు ఓ ఉపాధ్యాయుని చిన్ని ఆలోచనతో తీరిపోయాయి. స్వచ్ఛ భారత్​- స్వచ్ఛ విద్యాలయాల పథకంలో అవార్డు తెచ్చిపెట్టింది. పరిశుభ్రతలో మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది కిష్టాపూర్​ ప్రాథమిక పాఠశాల.

By

Published : Feb 7, 2019, 8:39 PM IST

ఒక్క ఆలోచన... స్వచ్ఛత వైపు..!


ఒక్క ఆలోచన... స్వచ్ఛత వైపు..!
బుద్ధిగా చదువుకునే 242 మంది విద్యార్థులు... జ్ఞానాన్ని పంచే ఐదుగురు ఉపాధ్యాయులు. కానీ సరిపడా శౌచాలయాలు మాత్రం లేవు. ఈ దుస్థితి మహబూబ్​నగర్​ జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్​ ప్రాథమిక పాఠశాలలో ఉండేది.
మూత్ర విసర్జనకు తమ విద్యార్థులు పడుతున్న అవస్థలు చూడలేక సృజనకు పదును పెట్టారు ఆ ఉపాధ్యాయులు. అప్పడు తట్టిన చిన్న ఆలోచనతో వారి బాధలు తీరిపోయాయి. వాడి పడేసిన నీళ్ల డబ్బాలతో మోబైల్​ టాయిలెట్లను తయారు చేశారు.
చిన్నారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన కుండీల్లో కులాయిలను ఏర్పాటు చేసి పిల్లలకు శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహాకారంతో చేపట్టిన స్వచ్ఛ భారత్​- స్వచ్ఛ విద్యాలయం కార్యక్రమంలో జిల్లా స్థాయి అవార్డు పొందారు. తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసిన శౌచాలయాలు చిన్నారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు.
ఒక సృజనాత్మకమైన ఆలోచన వీరిని స్వచ్ఛ భారత్‌- స్వచ్ఛ విద్యాలయాల వైపు నడిపించింది. జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఇదేవిధంగా మార్చాలని పాలనాధికారి రోనాల్డ్​రాస్​ ఆదేశించేంతగా.. పేరు తెచ్చిపెట్టింది.

ABOUT THE AUTHOR

...view details