తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2020, 9:55 PM IST

ETV Bharat / state

బండర్​పల్లి చెక్​డ్యామ్​లో మంత్రి శ్రీనివాస్​గౌడ్ జలపూజ

మహబూబ్ నగర్ జిల్లాలోని బండర్ పల్లి వాగుపై నిర్మించిన చెక్​డ్యామ్​ జలకలను సంతరించుకుంది. ఇటీవలె కురిసిన వర్షాలకు భారీగా వరదనీరు వచ్చి చేరడం వల్ల మంత్రి శ్రీనివాస్​గౌడ్ డ్యాంను సందర్శించి​ జలపూజ చేశారు.

minister srinivas goud jalapuja at bandarpally checkdam in mahabub nagar
బండర్​ పల్లి చెక్​ ​డ్యామ్​కు భారీగా వదరనీరు.. ఆబ్కారీ మంత్రి జలపూజ

మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలను అనుసంధానం చేసేందుకు బండర్ పల్లి వాగుపై రూ. 60 లక్షలతో చెక్​డ్యామ్​ నిర్మించారు. ఇటీవలె కురిసిన వర్షాలతో భారీగా వరదనీరు వచ్చి చేరి జలకళ సంతరించుకుంది.

దీనితో మంత్రి శ్రీనివాస్​గౌడ్​, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ల రెడ్డితో కలసి వచ్చి చెక్ డ్యామ్​ను సందర్శించి జలపూజ చేశారు. ఎమ్మెల్యేతో చెక్​డ్యామ్ వద్ద స్వీయ చిత్రాలు దిగుతూ సందడిగా గడిపారు.

ఇదీ చూడండి:సైన్యంలో మహిళా కమిషన్ ఏర్పాటుకు మరో నెల గడువు

ABOUT THE AUTHOR

...view details