తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2019, 3:41 PM IST

Updated : Mar 7, 2019, 4:18 PM IST

ETV Bharat / state

భగీరథ పనుల పరిశీలన

నారాయణపేట జిల్లాలో మిషన్​ భగీరథ పనులను జిల్లా పాలనాధికారి ఎస్. వెంకట్రావు పరిశీలించారు. వాటర్​ ట్యాంక్​ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్

మిషన్ భగీరథ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
నారాయణపేట జిల్లా బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న వాటర్​ ట్యాంక్​ పనులను జిల్లా పాలనాధికారి ఎస్.వెంకట్రావు పరిశీలించారు. మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి కాలం వస్తున్నందున జిల్లావ్యాప్తంగా ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చూడాలని మున్సిపల్​ అధికారులకు సూచించారు. నూతన పైప్​లైన్ల నిర్మాణ పనులన్నీ వారంలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Last Updated : Mar 7, 2019, 4:18 PM IST

ABOUT THE AUTHOR

...view details