తెలంగాణ

telangana

పల్లాకు మద్దతుగా ఎమ్మెల్సీ ప్రచారం

By

Published : Mar 8, 2021, 3:18 PM IST

మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉషా దయాకర్ రావు కోరారు.

The MLC election campaign is in full swing in the Torroor division center of Mahabubabad district
పల్లాకు మద్దతుగా ఎమ్మెల్సీ ప్రచారం

మహబూబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని 16వ వార్డులో పల్లాకు మద్దతుగా ఎర్రబెల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున ఎర్రబెల్లి ట్రస్ట్ ఛైర్మన్ ఉషా దయాకర్ రావు ప్రచారం చేశారు.

పాలకుర్తి నియోజకవర్గాన్ని మంత్రి ఎర్రబెల్లి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. పట్టభద్రులందరూ తెరాస వైపు ఉంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:సుశాంత్​ డ్రగ్​ కేసు: ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్​సీబీ

ABOUT THE AUTHOR

...view details