తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలు

తిరుమలేశుని దర్శనానికి బయలుదేరిన వారంతా రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులయ్యారు. మహబూబాబాద్​​​ జిల్లా బయ్యారంలో నామాల పాడు వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 30 మందికి పైగా గాయపడ్డారు. అతివేగం వల్ల జరిగిన ఘటనలో తృటిలో భారీ ప్రమాదం తప్పింది.

By

Published : Apr 16, 2019, 11:42 AM IST

రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి శివారు కొత్త తండా వాసులు తిరుపతి యాత్రకు బయలుదేరారు. వేసవి సెలవులు అయినందున 30 మందికి పైగా ప్రయాణమయ్యారు. వీరంతా బొలెరో వాహనంలో కొత్తగూడెం రైల్వేస్టేషన్​కు వచ్చారు. అప్పటికే రైలు వెళ్లిపోయినందున అదే వాహనంలో మహబూబాబాద్​కు వచ్చి కృష్ణ ఎక్స్​ప్రెస్​లో వెళ్లాలనుకున్నారు. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలిపోయింది. అదుపు తప్పిన వాహనం పల్టీ కొట్టింది. ఘటనలో వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మహబూబాబాద్​ జిల్లా ప్రధానాసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో 30 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details