తెలంగాణ

telangana

ETV Bharat / state

'మహిళల్లో చైతన్యం కోసమే 2కే పరుగు'

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో షీటీమ్​ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం సమయాభావం వల్ల ఇప్పుడు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.

By

Published : Mar 29, 2019, 7:42 PM IST

'మహిళల్లో చైతన్యం కోసమే 2కే పరుగు'

మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వం షీటీమ్స్​ను ఏర్పాటు చేసిందని మహబూబాబాద్​ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరిసా విగ్రహం వరకు షీటీమ్స్​ ఆధ్వర్యంలో 2కే పరుగు నిర్వహించారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకే ఈ పరుగు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సిబ్బంది, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

'మహిళల్లో చైతన్యం కోసమే 2కే పరుగు'

ABOUT THE AUTHOR

...view details