తెలంగాణ

telangana

ETV Bharat / state

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి గుండి గ్రామానికి ఆసిఫాబాద్​కు మధ్యలో పెద్దవాగు వర్షానికి పొంగి పొర్లుతోంది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో.... స్థానికులు, విద్యార్థులు థర్మాకోల్​తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాటుతున్నారు.

By

Published : Aug 9, 2019, 10:23 AM IST

Updated : Aug 9, 2019, 11:47 AM IST

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

థర్మాకోల్​తో తయారు చేసిన నాటు పడవల్లో ప్రమాదకరంగా వాగును దాటుతున్న వీరు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండి గ్రామానికి చెందిన విద్యార్థులు. ఆసిఫాబాద్​కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం నుంచి నిత్యం జిల్లా కేంద్రానికి ప్రజలు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. కుమురం భీం ప్రాజెక్టు నీళ్లతో పాటు ఇతర నదులను కలుపుకొని వచ్చే పెద్దవాగు ఇటీవల వర్షాలకు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నీటి ప్రవాహంలోనే నలుగురు వ్యక్తులు థర్మాకోల్ సహాయంతో పిల్లలను, ప్రజలను ఎక్కించుకుని ప్రవాహ వేగానికి అనుగుణంగా తోస్తూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చేరుతున్నారు. ఏ మాత్రం పట్టు తప్పినా నీటిలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

ఈ వంతెనకు 2012లో మూడు కోట్లతో టెండర్లు పిలిచి తర్వాత 11 కోట్లకు పెంచారు. అయినప్పటికీ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇప్పటికైనా పాలకులు అధికారులు పట్టించుకొని వంతెన పూర్తిచేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

థర్మాకోల్​ పడవల్లో ప్రమాదకర ప్రయాణం

ఇదీ చూడండి : బాబాపూర్​లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్​

Last Updated : Aug 9, 2019, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details