తెలంగాణ

telangana

ETV Bharat / state

గరంగరంగా కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. తమ వార్డులో నీటి ఎద్దడి సమస్య పరిష్కరించాలని కౌన్సిలర్​ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. కమిషనర్​ హామీతో శాంతించారు.

By

Published : Jun 1, 2019, 12:23 AM IST

కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికి సంబంధించి అధికారులు సప్లమెంటరీ అజెండాను ప్రవేశపెట్టారు. పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య లోపం ఉందని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరాలు లేవనెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. వార్డు నెంబర్​ ఏడులో గత నాలుగేళ్ల నుంచి నీటి ఎద్దడి ఉందని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన పరిష్కరించడం లేదని కౌన్సిలర్​ రూప కింద కూర్చొని నిరసన తెలిపారు. ప్రతిసారి హామీలిస్తున్నారు తప్పతే పనులు చేయడం లేదని ఆరోపించారు. సమస్య పరిష్కారానికి కమిషనర్​ తిరుపతి హామీ ఇవ్వటంతో ఆమె శాంతించారు.

కాగజ్​నగర్​ పురపాలక సర్వసభ్య సమావేశం

ABOUT THE AUTHOR

...view details