తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు లారీల్లో 104 పశువులు.. ముగ్గురిపై కేసులు

మూగ జీవాలను తరలిస్తున్న మూడు లారీలను కాగజ్ నగర్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 104 పశువులు ఉన్నాయని.. అందులో నాలుగు మృతిచెందినట్లు తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదుచేసినట్లు పేర్కొన్నారు.

By

Published : Sep 24, 2020, 12:15 PM IST

animal transportation
మూడు లారీల్లో 104 పశువులు.. ముగ్గురిపై కేసులు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్ మండలంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న మూడు లారీలను పోలీసులు పట్టుకున్నారు.

మూడు లారీల్లో 104 పశువులు.. ముగ్గురిపై కేసులు

పట్టణంలో వాహన తనిఖీలు చేస్తుండగా.. మూడు లారీల్లో పశువులు కనిపించినట్లు కాగజ్ నగర్ రూరల్ ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. మహారాష్ట్రలోని బండరా నుంచి హైదరాబాద్​కు తరలిస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మూడు లారీల్లో 104 పశువులున్నాయని.. అందులో నాలుగు మృతి చెందినట్లు తెలిపారు.

మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని.. పశువులను గోశాలకు తరలించినట్లు తెలిపారు. మృతిచెందిన వాటిని పశు వైద్యుల సమక్షంలో ఖననం చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు.

మూడు లారీల్లో 104 పశువులు.. ముగ్గురిపై కేసులు

ఇవీచూడండి:సెల్​ఫోన్​ల భారీ చోరీలో దర్యాప్తు ముమ్మరం

ABOUT THE AUTHOR

...view details