తెలంగాణ

telangana

ETV Bharat / state

'షీ' టీంపై అవగాహన... 2కె రన్ నిర్వహణ

షీ టీంపై అవగాహన కల్పించేందుకు 2కె రన్ నిర్వహించారు. విద్యార్థినిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని... అవాంఛనీయ సంఘటనలు జరిగితే షీ టీంకు వెంటనే ఫోన్ చేయాలని జిల్లా ఎస్పీ మల్లారెడ్డి సూచించారు.

By

Published : Mar 24, 2019, 12:09 PM IST

ఎస్పీ ఆధ్వర్యంలో 2కె రన్

ఎస్పీ ఆధ్వర్యంలో 2కె రన్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో షీ టీంపై అవగాహన కల్పించేందుకు 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థినిలతో కలిసి పరుగెత్తి ఉత్సాహపరిచారు. అవాంఛనీయ ఘటనలు జరిగిన వెంటనే షీ టీంకు కాల్ చేయాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. విజేతలకు బహుమతులు అందించారు.

ABOUT THE AUTHOR

...view details