తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి'

ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

By

Published : Jul 31, 2020, 12:24 PM IST

'కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి'
'కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి'

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ.. ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్ తో పాటు వివిధ పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముంబయిలో అంబేద్కర్ ఇంటిని ధ్వంసం చేసిన ఘటన 20 రోజులు గడుస్తున్నా... దోషులను శిక్షించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details