తెలంగాణ

telangana

ETV Bharat / state

మనసున్న మారాజులు.. చేయూతనిచ్చారు

వీరంతా అభం శుభం తెలియని పిల్లలు. ఆకలేస్తే చెప్పే స్థితిలో లేని దివ్యాంగులు. వారిని చేరదిసింది ఖమ్మం జిల్లా బోనకల్లులోని శాంతి నిలయం అనాథ ఆశ్రమం. లాక్​డౌన్​తో వీరికి బియ్యం లేకపోవటంతో స్పందించిన కొందరు సాయం చేశారు. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు.

By

Published : Apr 11, 2020, 1:01 PM IST

madira junior college old students help to orphan home
మనసున్న మారాజులు.. చేయూతనిచ్చారు

ఖమ్మం జిల్లా బోనకల్లులోని శాంతి నిలయం అనాథ ఆశ్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆశ్రయం పొందుతున్నారు. లాక్​డౌన్​తో వారికి నిత్యవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల 1981-83 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థులు గడ్డం శ్రీనివాసరావు, దేవరపల్లి నాగేశ్వరరావు, హుస్సేన్ సాయం చేయడానికి ముందుకొచ్చారు. వారి మిత్రులంతా కలిసి రూ.లక్ష నగదుతో పాటు శాంతి నిలయం ఆశ్రమంలో ఉన్న 65 మంది మానసిక దివ్యాంగులకు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.

మనసున్న మారాజులు.. చేయూతనిచ్చారు

ABOUT THE AUTHOR

...view details