తెలంగాణ

telangana

'దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు'

By

Published : Apr 27, 2021, 2:25 PM IST

ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీనితో ఖమ్మంలో ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు.

Khammam Corporation election trs campaign
Khammam Corporation election trs campaign

కార్పొరేషన్ ఎన్నికల చివరిరోజు ప్రచారంతో ఖమ్మం హోరెత్తుతోంది. ఆయాపార్టీల అభ్యర్థులకు మద్దతుగా నేతలంతా రంగంలోకి దిగి ప్రచారం చేపడుతున్నారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ ముఖ్య నేతలంతా నగరంలో మోహరించి ప్రచారం చేపడుతున్నారు.

50వ డివిజన్​లో తెరాస అభ్యర్థి శరత్​కు మద్దతుగా వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రవతి ప్రచారం నిర్వహించారు. డివిజన్​లో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్​కు ప్రజలు అండగా ఉండాలని నేతలు కోరుతున్నారు.

ఇదీ చూడండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!

ABOUT THE AUTHOR

...view details